ETV Bharat / state

విశాఖ మన్యం పర్యటనలో అమర్ సింగ్

author img

By

Published : Jul 7, 2021, 9:03 AM IST

భాజపా పార్లమెంటు సభ్యులు,రాజ్యసభలో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ విశాఖ పర్యటనకు వచ్చారు. విశాఖ మన్యం పాడేరులో ఏర్పాటు చేసిన భాజపా జిల్లా కార్యవర్గ సమావేశానికి అయన ముఖ్య అతిథిగా విచ్చేసారు. భాజపా నాయకులు, కార్యకర్తలకు పార్టీ బలోపేతం పట్ల దిశానిర్థేశం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రా భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు తదితరులు పాల్గోన్నారు.

bjp_mp_amarsingh_vishaka_paderu_visit
విశాఖ మన్యం పర్యటనలో భాజపా ఎంపీ

భాజపా పార్లమెంటు సభ్యులు,రాజ్యసభలో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ విశాఖ మన్యంలో పర్యటించారు.పాడేరులో జరిగిన భాజపా జిల్లా కార్యవర్గ సమావేశంలో ముఖ్యఅతిథిగా అమర్ సింగ్, సోము వీర్రాజు పాల్గొన్నారు. పాడేరు చేరుకున్న అయనకు మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. ఏజెన్సీ సంప్రదాయ విస్తర్లతో చేసిన గిడుగు ఆయన తలపై వేసి సన్మానించారు.

భాజపా నాయకులు, కార్యకర్తలకు పార్టీ బలోపేతం పట్ల దిశానిర్థేశం చేశారు. భాజపా కష్టపడే వాళ్లని గుర్తిస్తుందని చెప్పాడానికి కంభంపాటి హరిబాబును మిజోరం గవర్నర్​గా నియమించడమేనని గుర్తు చేశారు. కరోనా వల్ల చనిపోయిన భాజపా నాయకులకు నివాళులర్పించారు. పాడేరు మెడికల్ కాలేజ్, జాతీయ రహదారి, ఇంటింటి నీటి సరఫరా వంటివి కేంద్ర ప్రభుత్వ పథకాలు అని అందరికీ తెలియజేయాలన్నారు. కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా అందిస్తుందని తెలిపారు.

ఇదీ చదవండి: తొలినుంచి ప్రతి అంశంలో పార్టీ మాట జవదాటని తత్వమే ఆయనది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.