ETV Bharat / state

వేర్వేరు చోట్ల బైక్ ప్రమాదాలు... ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు

author img

By

Published : Jan 12, 2020, 11:49 PM IST

విశాఖలో రెండు వేర్వేరు చోట్ల బైక్ ప్రమాదాలు... ఒకరిమృతి,ఇద్దరికి గాయాలు
విశాఖలో రెండు వేర్వేరు చోట్ల బైక్ ప్రమాదాలు... ఒకరిమృతి,ఇద్దరికి గాయాలు

విశాఖ జిల్లాలోని మాడుగుల, హుకుంపేట మండలాల్లో ద్విచక్ర వాహన ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో ఒకరు చనిపోగా... ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో... ఒకరిమృతి, ఇద్దరికి గాయాలు

విశాఖలోని జి.మాడుగులలోని కోడాపల్లి వద్ద బైక్ అదుపుతప్పి 40 అడుగుల లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో మణికంఠ అనే యువకుడు మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ప్రమాదం హుకుంపేటలోని గన్నేరుపుట్టు వద్ద జరిగింది. ద్విచక్రవాహనం అదుపుతప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో ఒకరికి గాయలు కాగా, మరో వ్యక్తి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. క్షతగాత్రులను కేజీహెచ్​కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇవీ చదవండి:

లారీని ఢీకొన్న బొలెరో వాహనం... ఒకరు మృతి

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.