ETV Bharat / state

AP Udyoga Porata Committee meeting: 'జాబ్​ క్యాలెండర్​కు నాలుగేళ్లు.. ఉద్యోగాలేవి జగన్​ సార్​'

author img

By

Published : May 15, 2023, 8:02 PM IST

Updated : May 15, 2023, 8:16 PM IST

AP Udyoga Porata Committee: రాష్ట్రంలోని యువత, నిరుద్యోగులను సీఎం జగన్‌ మోసగించారని, అధికారంలోకి వచ్చి నాలుగేళ్లవుతున్నా హామీలు అమలు చేయలేదని.. విశాఖలో ఏపీ ఉద్యోగ పోరాట సమితి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. జగన్​ అధికారంలోని రాగానే జాబ్​ క్యాలెండర్​ విడుదల చేస్తానని చెప్పి నేటికి నాలుగు సంవాత్సరాలు గడిచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

AP Udyoga Porata Committee meeting
AP Udyoga Porata Committee meeting

AP Udyoga Porata Committee: రాష్ట్రంలో ఉద్యోగాలు లేక యువత అల్లాడుతున్నారు.. జగన్​ ప్రభత్వం జాబ్​ క్యాలెండర్​ పేరులో యువతను నిలువునా మోసం చేసింది.. మెగా డీఎస్సీ విడుదల చేయాలని, పీఈటీ పోస్టులు భర్తీ చేయాలని, జాబ్ క్యాలండర్ విడుదల చేయాలని ఏపీ ఉద్యోగ పోరాట సమితి విశాఖలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి రాగానే మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రకారం మొట్ట మొదటిగా ప్రతి జనవరి నెల ఒకటో తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని హామీ ఇచ్చి నేటికి సరిగ్గా 4 సంవత్సరాలు గడిచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు.. మొదటిలో గ్రూప్-2 పోస్టులు ఐదు వేలు ఖాళీగా ఉంటే 181 పోస్టులకు నోటిఫికేషన్ ప్రకటించి వైసీపీ ప్రభుత్వం చేతులు దులుపుకున్నారని అన్నారు. "పీహెచ్​డీ, ఎంఫీఎల్" చేసినా వేలాది నిరుద్యోగులు ఆచార్యుల పోస్టుల భర్తీకి ఎదురుచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభత్వం రాష్ట్రంలో ఉద్యోగాలను భర్తీ చేశామని చెబుతోంది కానీ.. అందులో నాలుగు లక్షలు వాలంటీర్లు, సచివాలయ సిబ్బందే ఉన్నారు. నూతనంగా ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదని.. ప్రభుత్వాన్ని నిలదీశారు. జాబ్​ క్యాలెండర్​పై విద్యార్థులు, యువకులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో లక్షల మంది మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ప్రతిక్షణం నిరీక్షిస్తున్నారని అన్నారు.

ప్రభుత్వ ఉద్యోగాలు లేవు.. ప్రైవేటు పరిశ్రమలు లేవు.. వైద్య ఆరోగ్య శాఖలో సుమారు పది వేల 143 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వమే అధికారికంగా తెలిపింది.. కానీ ఇప్పటి వరకు వాటిని భర్తీ చేయకపోవడం దారుణం అని అన్నారు. అలాగే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 240 పోస్టులు, విశ్వవిద్యాలయాల్లో రెండు వేల ప్రొఫెసర్ల పోస్టులు భర్తీకి గత ఫిబ్రవరిలో నోటిఫికేషన్లు వెలువడాల్సి ఉండగా ఈ రోజు వరకు అతీగతీ లేదని ఆరోపించారు. ఇచ్చిన హామీల ప్రకారం ప్రతి ఏడాదీ జనవరి నెల ఒకటో తారీఖున జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి చొరవతో నోటిఫికేషన్లు ఇచ్చి ఉంటే నిరుద్యోగ శాతం చాలా వరకు తగ్గేదని అన్నారు. ఇటు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ లేక.. అటూ ప్రైవేటు పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు కోసం ప్రయత్నిద్దామంటే రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు మూతబడ్డాయి.. కొత్త పరిశ్రమాలు వచ్చే జాడ కూడా లేదు అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి :

Last Updated : May 15, 2023, 8:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.