ETV Bharat / state

అప్పన్న సన్నిధిలో శుభకార్యాల నిర్వహణకు భక్తులకు అనుమతి

author img

By

Published : Oct 16, 2020, 5:14 PM IST

simhachalam temple
simhachalam temple

దాదాపు ఏడు నెలలు తరువాత విశాఖ జిల్లాలోని అప్పన్న ఆలయంలో శుభకార్యాల నిర్వహణకు భక్తులకు అనుమతి లభించింది. ఈ మేరకు దేవదాయశాఖ కమిషనర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

విశాఖ సింహాచలంలోని సింహాద్రి అప్పన్న సన్నిధిలో శుభకార్యాలు నిర్వహించుకోవడానికి భక్తులకు అనుమతినిస్తూ దేవదాయ శాఖ కమిషనర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే శుభకార్యాల సమయంలో కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని ఆలయ ఈవో త్రినాథరావు వివరించారు.

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా మార్చి 23 నుంచి సింహగిరిపై శుభకార్యాలు, వసతికి అనుమతి ఇవ్వలేదు. లాక్​డౌన్ సడలింపు నేపథ్యంలో తాజాగా ఈ ఉత్తర్వులు ఇస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. దీనివల్ల అప్పన్న ఆదాయం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇదీ చదవండి

దుర్గ గుడి పైవంతెన ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.