ETV Bharat / state

జగన్నతోడు పథకం లబ్ధిదారులు.. 74,127 మంది

author img

By

Published : Nov 25, 2020, 12:41 PM IST

విశాఖ జిల్లాలో జగనన్న తోడు పథకానికి 74,127 మంది లబ్ధిదారులను అర్హులుగా గుర్తించినట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ విశ్వేశ్వరరావు వెల్లడించారు.

jaganna thodhu
జగన్నతోడు

విశాఖ జిల్లాకు సంబంధించి జగనన్న తోడు పథకానికి 74,127 మంది లబ్ధిదారులను అర్హులుగా గుర్తించారు. ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ విశ్వేశ్వరరావు తెలిపారు.

చిరు వ్యాపారులు, తోపుడు బళ్ల వారికి ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం ఈ పథకం రూపొందించిందని తెలిపారు. ఈ పథకంలో భాగంగా చిరు వ్యాపారులు ఒక్కొక్కరికి రూ.10 వేల రుణం అందించనున్నట్లు వెల్లడించారు. ఈ పంపిణీ ఆయా మండలాలు అధికారుల ద్వారా కొనసాగుతుందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

మరి కొన్ని గంటల్లో.. పెను తుపానుగా బలపడనున్న నివర్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.