ETV Bharat / state

TTD focus on Accidents: ప్రమాదాల నివారణకు తితిదే చర్యలు.. మూడు ప్రత్యేక బృందాల ఏర్పాటు

author img

By

Published : May 30, 2023, 7:22 PM IST

tirumala ghat road
తిరుమల ఘాట్​ రోడ్డు

TTD focus on Accidents: తిరుమల తిరుపతి ఘాట్​ రోడ్డు ప్రమాదాల నుంచి దారి దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, అవగాహన లోపం, వేగాన్ని నియంత్రించటంలో అలస్యం, ఇలా ఏదో ఓ కారణం వాహనాదారులను ప్రమాదాలకు గురిచేస్తున్నాయి. అయితే తితిదే ప్రస్తుతం ప్రమాదాలను నివారించటానికి చర్యలకు పూనుకుంది

Accidents on Tirumala Ghat Road : తిరుమల తిరుపతి ఘాట్​ రోడ్డులో తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ ప్రమాదాలపై తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించి.. నివారణకు పూనుకుంది. తిరుమలకు సంబంధించి రెండు ఘాట్​ రోడ్లలో డ్రైవర్ల నిర్లక్ష్యం, రోడ్డుపై అవగాహన లేకపోవటం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నట్లు.. తిరుమల అడిషినల్​ ఎస్పీ ముని రామయ్య స్పష్టం చేశారు. వాహనాలు నడుపుతూ సెల్​ఫోన్లలో మాట్లాడటం, అజాగ్రత్తగా వాహనాలు నడపటం కూడా ప్రమాదాలకు దారి తీస్తున్నాయన్నారు.

ఘాట్​ రోడ్డులో ప్రయాణించే వాహనాలు ఇక నుంచి నిర్దేశిత సమయానికి చేరుకునేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఘాట్​ రోడ్డు​లోని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఏఎస్పీ ముని రామయ్య ప్రభుత్వ ఆర్టీవో, విజిలెన్స్, ట్రాఫిక్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఘాట్​ రోడ్డులోని ప్రమాదాలకు గల కారణాలను, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

ఇదీ చదవండి: Tirumala: తిరుమలలో ఎలాంటి ఉగ్రవాదుల సంచారం లేదు: ఎస్పీ పరమేశ్వరరెడ్డి

ఘాట్​ రోడ్డులో భక్తులు వాహనాలు నిలిపి ఫొటోలు​, సెల్ఫీలు వంటివి తీసుకోవటం కూడా ప్రమాదాలకు ఓ కారణమేనని ఏఎస్పీ ముని రామయ్య తెలిపారు. వాహనాలు ఫిట్​నెస్​ లేకుండా ఘాట్​ రోడ్డులోకి రావద్దని.. రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఘాట్​ రోడ్డులో వాహనాలు నడిపే డ్రైవర్లకు లైసెన్సులు తప్పనిసరి అని.. లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దూర ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే ప్రయాణికులు తగిన విశ్రాంతి తీసుకున్న తర్వాతే.. ఘాట్​ రోడ్డులో ప్రయాణం చేయాలని సూచించారు. అలిపిరి వద్ద ప్రత్యేక బృందాలు ఫిట్​నెస్​ను పరిశీలించిన తర్వాతే ఘాట్​ రోడ్డులోకి అనుమతి ఉంటుందని తెలిపారు.

ప్రమాదల నివారణ చర్యలలో భాగంగా మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇప్పటి వరకు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించినట్లు వెల్లడించారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాలలో స్పీడ్​ బ్రేకర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో అమలులో ఉన్న వేగ​ పరిమితిని మళ్లీ అమలులోకి తీసుకువస్తున్నట్లు వివరించారు. వాహనాదారులు దీనిని గమనించాలని.. వాహనాల వేగంలో పరిమితిని పాటించాలని సూచించారు. ఫాస్ట్​ట్రాక్​ అనే విధానాన్ని మళ్లీ అమల్లోకి తీసుకురాబోతున్నామని అన్నారు.

రెండు ఘాట్​ రోడ్లలోని ప్రమాదాల నివారణకు తితిదే చర్యలు

" ప్రమాదల నివారణ చర్యలలో భాగంగా మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాము. ఇప్పటి వరకు ప్రమాదాలు జరిగిన ప్రాంతాలను గుర్తించి అక్కడ స్పీడ్​ బ్రేకర్లను ఏర్పాటు చేస్తున్నాము. గతంలో అమల్లో ఉన్న వేగ​ పరిమితిని తిరిగి అమలులోకి తీసుకువస్తున్నాము. వాహనదారులు వేగంలో పరిమితిని పాటించాలి." -ముని రామయ్య, ఏఎస్పీ

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.