ETV Bharat / state

వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తుల జయజయధ్వానాల మధ్య స్వామి వారి రథోత్సవం

author img

By

Published : Oct 4, 2022, 12:56 PM IST

Updated : Oct 4, 2022, 1:10 PM IST

rathotsavam
rathotsavam

BRAHMOTSAVALU : తిరుమలలో బ్రహ్మాండనాయకుడి సాలకట్ల బ్రహ్మోత్సావాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నేడు రథోత్సవంలో భాగంగా స్వామి వారు ఉభయదేవేరులతో కలిసి భక్తులకు అభయ ప్రదానం చేశారు. నేడు సాయంత్రం స్వామి వారు అశ్వవాహనం పై విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.

RATHOTSAVAM: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం వైభవంగా సాగింది. మేరుపర్వతం వంటి రథంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారు ఆశీసులై భక్తులకు దర్శనమిచ్చారు. వేలాది మంది భక్తులు.. తేరుపగ్గాలను పట్టుకొని రథాన్ని ముందుకు కదిలించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు కర్పూర హారతులు సమర్పించారు. ఈ రాత్రి ఏడూ గంటలకు జరిగే అశ్వవాహనంతో వాహన సేవలు ముగుస్తాయి.

రథోత్సవం : ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు, ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చుతారు. దీన్నివల్ల స్థూల శరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుందని భక్తుల నమ్మకం.

వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తుల జయజయధ్వానాల మధ్య స్వామి వారి రథోత్సవం

ఇవీ చదవండి:

Last Updated :Oct 4, 2022, 1:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.