ETV Bharat / state

పిల్లలూ జాగ్రత్తా..! చైనా మాంజా విక్రయిస్తే ఐదేళ్ల ఖైదు, లక్ష జరిమానా!

author img

By

Published : Jan 13, 2023, 11:38 AM IST

Dont use Chinese manjas
Dont use Chinese manjas

Dont use Chinese manjas: సంక్రాంతి పండగ వచ్చిందంటే రంగురంగుల రంగవెళ్లులకు మాత్రమే కాదు.. రంగురంగుల పతంగులకు ప్రత్యేకం. ఎందుకంటే చిన్నాపెద్దా అందరూ గాలిపటాలను ఎగవేయాలని నిర్ణయించుకుంటారు. కానీ అవి సాంప్రదాయ దారంతో ఎగరవేస్తే మనుషులు, మూగజీవులు, పక్షులకు మేలు.. అలాగే పర్యావరణానికి ఎంతో మేలు. అందుకే చైనా మాంజాల వాడకాన్ని నిషేధించాలని తెలంగాణాలో కోరుకుంటున్నారు.

Dont use Chinese manjas: సంక్రాంతి పండగ అంటే రంగురంగుల గాలి పటాలు.. అవి ఎగురుతుంటే చిన్నపెద్దా అందరికీ ఉత్సాహమే. పతంగులు ఎగురవేయడానికి ప్రతి ఒక్కరు పోటీ పడుతుంటారు. కానీ ఈ గాలి పటాలకు ఉపయోగించే మాంజాపై అప్రమత్తంగా ఉండాలంటోంది అటవీ శాఖ. ఎందుకంటే పర్యావరణానికి హాని కలిగించే.. సింథటిక్‌ చైనీస్‌ మాంజా వల్ల మానవులకు, మూగజీవులకు, పక్షులకు హాని కలుగుతుందని వాటిని వాడవద్దని తెలంగాణా అధికారులు సూచిస్తున్నారు. చైనా మాంజాల వాడకాన్ని నిషేధించామని.. వాటిని విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

ఎగిరే గాలిపటానికి ఆధారం దారం.. పతంగులు గాలిలో ఎగరాలంటే దారంతో పాటు మాంజా కీలకం. సింథటిక్‌ దారం.. చైనీస్‌ మాంజా వాడకాన్ని జాతీయహరిత ట్రైబ్యునల్​ ఉత్తర్వుల- 2016 ప్రకారం ప్రభుత్వం నిషేధించింది. గాలిపటాలను ఎగురవేసేందుకు ఉపయోగించే.. గ్లాస్‌ కోటింగ్‌తో ఉన్న నైలాన్‌, సింథటిక్‌ మాంజా వల్ల.. పర్యావరణానికి హాని జరుగుతోంది. దారంలో చిక్కుకున్న పక్షులు విలవిలలాడి మృతి చెందుతున్నాయి. మనుషులు గాయాలపాలవుతున్నారు. నిషేధిత మాంజాలకు బదులుగా సంప్రదాయ కాటన్‌ దారాలను పతంగులకు వాడాలని అటవీ ఉన్నతాధికారులు సూచించారు. దీనివల్ల పర్యావరణానికి ఎంతో మేలు చేసిన వారిమి అవుతామని పేర్కొన్నారు.

పోలీసులతో పాటు ఇతర శాఖల అధికారులు సమన్వయంతో.. నిషేధిత మాంజా వాడవాన్ని అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. పాతబస్తీలోని చార్మినార్‌, గుల్జార్‌హౌజ్‌, ధూల్‌పేట్‌, కోఠి, సికింద్రాబాద్‌ తదితర ప్రాంతాల్లోని.. పతంగులు, మాంజాల విక్రయాల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. చైనీస్ మాంజా అనర్థాలపై స్వచ్ఛంద సంస్థల సహకారంతో అవగాహన కల్పిస్తున్నారు.

చైనా మాంజా విక్రయిస్తే ఐదేళ్ల ఖైదు, లక్ష జరిమానా ఉందని తెలిపారు. మాంజా వాడకం వల్ల మనుషులకు, పక్షులకు హాని జరిగితే 3 నుంచి 7 ఏళ్ల దాకా జైలు శిక్ష రూ.10 వేల జరిమానా విధిస్తారని అధికారులు తెలిపారు. నిషేధం అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 28 లక్షల రూపాయల విలువైన 1391 కిలోల దాకా చైనీస్ మాంజా సీజ్ చేసినట్టు అధికారులు తెలిపారు.

చైనా దారం దిగుమతితో స్థానికంగా కాటన్‌ పంతుగుల దారం తయారీదారులు ఉపాధి కోల్పోతున్నారు. ఈ మాంజా రవాణా చేస్తే వాహనాలు కూడా సీజ్ చేస్తామని.. అటవీ, పోలీసు శాఖల అధికారులు హెచ్చరిస్తున్నారు. పండగ సీజన్​లో నిఘా కోసం ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. చైనా దారం అమ్మకం గురించిన వివరాలు తెలిస్తే ప్రజలు అటవీ శాఖ టోల్ ఫ్రీ నెంబర్లు 040 -23231440, 1800 4255 364 తెలియజేయాలని కోరుతున్నారు.

ఈ సంక్రాంతికి చైనా మాంజాలను ఉపయోగించవద్దు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.