ETV Bharat / state

Attack on Young woman: మహిళపై కత్తులతో దాడి... చనిపోయిందనుకుని..!

author img

By

Published : Oct 26, 2022, 1:22 PM IST

Attack on Young woman
మహిళపై కత్తులతో దాడి

Attack on Young woman: తిరుపతి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. దుండగులు మహిళపై కత్తులతో దాడి చేసి.. అటవీ ప్రాంతంలో వదిలి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు.. బాధిత మహిళను చికిత్సకోసం బాధితురాలిని తమిళనాడు తరలించారు.

Attack on Young woman: తిరుపతి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని దొరవారిసత్రం మండలంలో మహిళపై దుండగులు కత్తులతో దాడి చేశారు. దుండగులు.. మహిళ తల చేతులపై తీవ్ర గాయాలు చేశారు. మహిళ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దొరవారిసత్రం మండలం మినమలమూడి అటవీ ప్రాంతంలో ఘటన చోటుచేసుకుంది. స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించగా ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మహిళ చనిపోయిందనుకొని అటవీ ప్రాంతంలో దుండగులు వదిలి వెళ్లినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చికిత్స కోసం బాధితురాలిని తమిళనాడుకు తరలించారు. బాధితురాలు తమిళనాడు వాసిగా పోలీసులు గుర్తించారు. నిందితుల కోసం
గాలిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.