Palasa Municipal Meeting: శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపల్ సమావేశంలో.. అధికార పార్టీ సభ్యుల నుంచే తీవ్ర నిరసన చెలరేగింది. వార్డుల్లో ఏ ఒక్క పనీ చేయడం లేదంటూ వైకాపా కౌన్సిలర్ బోర చంద్రకళ... ఛైర్మన్ పోడియం ముందు బైఠాయించారు. కొద్దిసేపటి తర్వాత వైస్ ఛైర్మన్ కృష్ణారావు, మరో కౌన్సిలర్ ఉమాకుమారి కూడా ఆమెకు జత కలిశారు. ఎన్నిసార్లు చెప్పినా అధికారులు తమ వార్డుల్లో సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఛైర్మన్ గిరిబాబుకు, కౌన్సిలర్లకు మధ్య వాగ్వాదం జరిగింది. అధికార పార్టీ సభ్యులుగా ఉంటూ నిరసనకు దిగడాన్ని సహించేది లేదంటూ వైస్ ఛైర్మన్తోపాటు మరో ఇద్దరు సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: AP Employees Protests: 'చర్చల పేరిట తప్పుదోవ పట్టించేందుకు ప్రభుత్వం కుట్ర'