ETV Bharat / state

రోడ్డు కోసం సభాపతితో మహిళలు వాగ్వాదం

author img

By

Published : Dec 30, 2020, 4:49 PM IST

శాసన సభాపతి తమ్మినేని సీతారామ్​కు నిరసన సెగ తగిలింది. ఆమదాలవలస గేటు వద్ద నిర్వహించిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనతో మహిళలు వాగ్వాదానికి దిగారు. బీఆర్​ నగర్​కు చెందిన పలువురు మహిళలు..రోడ్డు కోసం నిలదీశారు.

speaker tammineni sitaram
speaker tammineni sitaram

రోడ్డు కోసం సభాపతితో మహిళలు వాగ్వాదం

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస గేటు వద్ద నిర్వహించిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో సభాపతి తమ్మినేని సీతారాంతో కొందరు మహిళలు వాగ్వాదానికి దిగారు. బీఆర్ నగర్​కు చెందిన మహిళలు.. రోడ్డు కోసం ఆయన్ను నిలదీశారు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండాపోయిందని వాపోయారు. స్పందించిన సభాపతి.. సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. లిఖితపూర్వకంగా దరఖాస్తు చేయాలని వారికి సూచించారు.

ఇదీ చదవండి

విగ్రహాల ధ్వంసంపై ప్రధాని మోదీకి.. ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.