ETV Bharat / state

రెండు రోజులుగా వర్షాలు..ప్రమాదకరంగా నీటిలో ప్రయాణం

author img

By

Published : Nov 13, 2021, 8:02 PM IST

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు(rains) శ్రీకాకుళం జిల్లాలో పుచ్చపాడు గ్రామం జలదిగ్భంధంలో చిక్కుకుంది. రహదారిపై నీరు ప్రవహిస్తుండటంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి.

మహిళ
మహిళ

నీటిలో తాడు సాయంతో వెళ్తున్న మహిళ

శ్రీకాకుళం జిల్లా మందస మండలం పుచ్చపాడు గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు(rains) రహదారిపై నీరు ప్రవహిస్తోంది. దీంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసరాల కోసం తాడు సాయంతో అవతలి ఒడ్డుకు వెళ్తున్నారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న భర్తకు మందులు తీసుకురావడానికి యువకుల సహాయంతో ఓ మహిళ.. తాడు పట్టుకుని ప్రమాదకర స్థాయిలో నీటిలో నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది.

ఇదీ చదవండి:

వైద్య ఖర్చులు తగ్గించే ఆవిష్కరణలు రావాలి: డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.