ETV Bharat / state

శ్రీకాకుళం జిల్లాలో గుడిలో బడి..విద్యార్థుల వ్యధ అంతా ఇంతా కాదు..

author img

By

Published : Mar 25, 2023, 10:55 AM IST

Updated : Mar 25, 2023, 1:38 PM IST

Students In Temple: ఆ విద్యార్థులు నాడు బడిలో చదువుకున్నారు. నేడు గుడిలో తరగతులు వింటున్నారు.! జగనన్న నాడు-నేడు పథకం అక్కడ పెట్టలేదా అనేగా మీ ప్రశ్న? ఆ పథకం వల్లే బడి కాస్తా గుడిలోకి మారింది. ఉన్న భవనాన్ని అధికారులు కూల్చేశారు. గుత్తేదారు పనులు మొదలెట్టేశారు. కానీ బిల్లులు ఇవ్వకపోవడంతో పనులు మధ్యలోనే ఆపేశారు. విద్యార్థుల చదువులు చికాకుల మధ్య సాగుతున్నాయి. మా స్కూల్‌ మాకు ప్రారంభించండి అని విద్యార్థులు మొత్తుకుంటున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో గుడిలో బడి
శ్రీకాకుళం జిల్లాలో గుడిలో బడి

శ్రీకాకుళం జిల్లాలో గుడిలో బడి

Students In Temple : నాడు - నేడు పథకానికి ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో శ్రీకాకుళం జిల్లాలో పాఠశాల అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పాఠశాలల్లో మౌలిక వసతులు సరిగ్గా లేక అంగన్వాడి కేంద్రాలు, ఆలయాల్లో పాఠాలు చెబుతున్నారు. మరుగుదొడ్లు తరగతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం గదబపాలెం గ్రామం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో 4 నెలల క్రితం నేలమట్టం చేశారు. నాడు-నేడులో కొత్త భవన నిర్మాణం చేపట్టారు. నూతన భవన నిర్మాణానికి 30 లక్షలు మంజూరు కావడంతో పనులు ప్రారంభించారు. గుత్తేదారు పిల్లర్లు వేశారు. ఇక అంతే అక్కడి నుంచి ఇటుక పెడితే ఒట్టు. ఇప్పటి వరకు 93 వేలు మాత్రమే చెల్లింపులు జరగగాయి. గుత్తేదారుకు మిగిలిన బిల్లులు రాకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.

గదబపాలెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి ఐదో తరగతి వరకూ 40 మంది విద్యార్థులున్నారు. పిల్లల చదువులు ఆగిపోకుండా ఉపాధ్యాయులు సర్దుబాటు చేశారు. సగం మంది విద్యార్థులకు ఊళ్లోని రామాలయంలో పాఠాలు చెప్తున్నారు. బడి ఎలాగో, గుడీ అలాగే. రోజూ పూజలు జరగుతుంటాయి. ఎవరో ఒకరు దర్శనాలకు వచ్చి వెళ్తుంటారు. అలాంటి సమయాల్లో ఇబ్బందిగా ఉంటోందని విద్యార్థులు చెప్తున్నారు.

బడి భవనం కూల్చేయడంతో ఇంకొంత మంది విద్యార్థులను అంగన్వాడీ కేంద్రంలో కూర్చోబెడుతున్నారు. అక్కడ ఇరుకుగా ఉంటోందని పిల్లులు చెప్తున్నారు. విద్యార్థులు తాగునీరు, మరుగుదొడ్లు లాంటి సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్నారు.

గదబపాలెం వ్యవసాయ ఆధారిత గ్రామం. పేద కుటుంబాలే ఎక్కువగా కనిపిస్తాయి. ప్రైవేటుకు పంపే స్థోమత లేక పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్చితే పరిస్థితి ఇలా మారిందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పిల్లల చదువులు సరిగా సాగడం లేదని విచారం వ్యక్తం చేస్తున్నారు.

" పాఠశాల కడతామని, స్కూల్ కూల్చివేసి నాలుగు నెలలు అవుతోంది. ఇప్పటికి కట్టలేదు. రామ మందిరం దగ్గర చదవుకుంటున్నాము. పూజలు చేయటంతో డిస్టర్బ్​గా ఉంటుంది. అంగన్వాడి పిల్లలు గోల పెడుతున్నారు. టాయిలెట్​కి ఇబ్బంది అవుతోంది. బాత్​రూమ్​కి చాలా దూరం వెళుతున్నాం. మాకు తొందరగ బడి కట్టిస్తే సంతోషంగా ఉంటాము. " - విద్యార్థులు

" ఉన్న స్కూలు పడగొట్టేశారు. బిల్లులు పడక సగం పనులు ఆగిపోయాయి. ప్రభుత్వం కూడా పట్టించుకోకుండా బిల్లులు వేయకపోతే ఎక్కడ నుంచి తెచ్చి కడతారండి. బయటకు వెళితే గంటకు రెండు గంటలకు రావచ్చు. ఆడుకుంటూ ఆడుకుంటూ ఉండిపోవచ్చు. చదువు ఎప్పుడు అవ్వుది. అదే స్కూల్ కడితే గేటు ఉంటది. మాస్టారు వాళ్లను పిలవడానికి బాగుంటది. చదువు మీద దృష్టి పెట్టి చదవడానికి పిల్లలకు బాగుంటది. " - రామినాయుడు, గదబపాలెం

ఇవీ చదవండి

Last Updated : Mar 25, 2023, 1:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.