శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం లక్ష్మీపురంలో ఈస్ట్ కోస్ట్ పవర్ ప్లాంట్, హుద్ హుద్ భవనాలలో ఏర్పాటుచేసిన క్వారంటైన్ కేంద్రాలను కలెక్టర్ జె.నివాస్ పరిశీలించారు. ఆయా కేంద్రాలలో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని... పాజిటివ్ కేసులు నమోదైతే మరింత జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈస్ట్ కోస్ట్ పవర్ ప్లాంట్లో ఉన్న 19 బ్లాకులు, హుద్ హుద్ భవనాలలో ఉన్న 11 బ్లాకులపై ఆరా తీశారు. ఇటీవల ఫలక్ నుమా ఎక్స్ప్రెస్ రైలులో వచ్చిన వలస కార్మికులతో మాట్లాడారు. వారికి అందుతున్న సేవలు, పౌష్టికాహారంపై అడిగి తెలుసుకున్నారు. క్వారంటైన్లో ఉన్న వారిపై వివక్ష చూపరాదని సూచించారు. క్వారంటైన్లో ఉన్నవారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని... భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: రేషన్ కందిపప్పు తూకంలో అవకతవకలు..