ETV Bharat / state

ఇరిగేషన్​ పనులకు శాసన సభాపతి తమ్మినేని సీతారాం శంకుస్థాపన

author img

By

Published : Jul 7, 2021, 6:47 PM IST

శ్రీకాకుళం జిల్లాలో నీటిపారుదల శాఖకు చెందిన పలు అభివృద్ధి పనులకు శాసన సభాపతి తమ్మినేని సీతారాం శంకుస్థాపన చేశారు. త్వరలో సుమారు 4500 ఎకరాలకు నీరు అందుతుందని తెలిపారు.

Tammineni Sitaram laying the foundation stone for irrigation works
ఇరిగేషన్​ పనులకు శంకుస్థాపన

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలోని లొద్దలపేట, నెల్లిపర్తి వద్ద ఇరిగేషన్ పనులకు శాసన సభాపతి తమ్మినేని సీతారాం శంకుస్థాపన చేశారు. లొద్దలపేట గ్రామంలో సుమారు రూ. 9 లక్షల నిధులతో 4 కిలోమీటర్ల పొడవైన కాలువ పనులను ప్రారంభించారు. ఈ పనులు పూర్తైతే ఆమదాలవలస, పొందూరు మండలాల్లో సుమారు 2500 ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుందని చెప్పారు.

మరో రూ. 9 లక్షలతో నెల్లిపర్తి వద్ద హైలెవల్ ఛానల్ పనులను స్పీకర్ ప్రారంభించారు. ఈ నిర్మాణం పూర్తి అయితే కెనాల్ దిగువన ఉన్న 2000 ఎకరాల రైతులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తమ్మినేని శ్రీరామ్మూర్తి, సర్పంచ్​లు, వైకాపా నేతలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

పోలవరం నిర్వాసితుల ఇక్కట్లు... గ్రామం నుంచి బయటకు వెళ్తే తిరిగి నో ఎంట్రీ

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.