ETV Bharat / state

'పూర్వీకులు మనకు ఇచ్చిన ఆస్తి భగవదారాధన'

author img

By

Published : Mar 22, 2021, 5:30 PM IST

Chandramoulisvarula Peetharchana
శారదా స్వరూప రాజశ్యామల చంద్రమౌళీశ్వరుల పీఠార్చన

శారదా స్వరూప రాజశ్యామల చంద్రమౌళీశ్వరుల పీఠార్చన.. శ్రీకాకుళంలో వైభవంగా జరిగింది. నిత్యం భగవన్నామ సంకీర్తన, లలితా సహస్రనామ పారాయణ ంచేయడం ద్వారా లోక లోకాలనూ ఏలే జగన్మాత అనుగ్రహం లభిస్తుందని పురోహితులు చెప్పారు.

శ్రీకాకుళంలో శారదా స్వరూప రాజశ్యామల చంద్రమౌళీశ్వరుల పీఠార్చన వైభవంగా జరిగింది. పూర్వీకుల నుంచి మనకు సంక్రమించిన గొప్ప ఆస్తి భగవదారాధన అని... విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి అన్నారు. అనంతరం ఎంహెచ్ స్కూల్ గ్రౌండ్స్ లో అనుగ్రహభాషణం చేశారు.

దైవ దర్శనం, ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసినంత మాత్రాన హైందవ సంస్కృతిని పరిరక్షించుకోలేమన్న ఆయన... ఆలయ సంపదను పరిరక్షించుకోవడం, నిత్యం దైవారాధనలో ఉండే అర్చకులను ఆదుకోవడం ద్వారా హైందవ ధర్మాన్ని కాపాడుకోగలమన్నారు. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, మాజీ ఎమ్మెల్యే గొండి లక్ష్మీదేవి, స్థానికులు.. పీఠార్చన తిలకించారు.

ఇవీ చూడండి:

శ్రీకాకుళంలో కొనసాగిన హిందూ ధర్మ ప్రచార యాత్ర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.