ETV Bharat / state

'వైకాపా మాయ మాటలకు ప్రజలు మోసపోవద్దు'

author img

By

Published : Feb 18, 2021, 8:14 PM IST

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మేజర్ పంచాయతీలో శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమ ప్రభుత్వ హయాంలో పంచాయతీలు ఎంతో అభివృద్ధి చెందాయని గుర్తు చేసుకున్నారు.

MP Rammohan Naidu campaigning in Narasannapeta Major Panchayat in Srikakulam district
'వైకాపా మాయ మాటలకు ప్రజలు మోసపోవద్దు'

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మేజర్ పంచాయతీలో శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నరసన్నపేటలోని పెద్దపేట వీధి నుంచి సత్యవరం వరకు ప్రచారం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో పంచాయతీలు ఎంతో అభివృద్ధి చెందాయని రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు.

వైకాపా మాయ మాటలకు ప్రజలు మోసపోవద్దని సూచించారు. పంచాయతీ ఎన్నికల్లో తెదేపా మద్దతుదారులనే గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి, సర్పంచ్ అభ్యర్థి బెవర రాము, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

రథసప్తమికి సిద్ధంగా.. అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.