శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల పోలీసు స్టేషన్ పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసిన మాజీ సర్పంచ్ చౌదరి అవినాష్ను.. తెదేపా రాష్ట్ర అధ్యక్షులు కిమిడి కళావెంకట్రావు పరామర్శించారు. వైకాపా సర్కారు పాలనలో రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో నియంత పరిపాలన జరుగుతోందని విమర్శించారు. అవినాష్కు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.