ETV Bharat / state

Financial Assistance: అమర జవాన్​ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం

author img

By

Published : Jul 17, 2021, 4:44 PM IST

లద్దాఖ్‌లోని బటాలిక్‌ సెక్టార్‌లో విధులు నిర్వర్తిస్తూ అమరుడైన జవాన్​ లావేటి ఉమామహేశ్వరరావుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక పరిహారం అందింది. సీఎం సహాయనిధి నుంచి కేటాయించిన రూ.50 లక్షల చెక్కును ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌, కలెక్టర్​ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ సంయుక్తంగా అందజేశారు.

Financial Assistance to jawan family
అమర జవాన్​ కుటుంబానికి.. రూ.50 లక్షల సాయం

జవాన్​ కుటంబానికి రూ. 50 లక్షల పరిహారం చెక్కు అందించిన ధర్మాన, కలెక్టర్ బి.లఠ్కర్‌..

శ్రీకాకుళానికి చెందిన జవాన్‌ లావేటి ఉమామహేశ్వరరావు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ రూ.50 లక్షల నష్టపరిహారాన్ని అందజేశారు. కలెక్టర్ కార్యాలయంలో వీర జవాన్​ లావేటి ఉమామహేశ్వరరావు సతీమణి నిరోషాకు కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌తో కలిసి కృష్ణదాస్ చెక్కును అందించారు.

ఏం జరిగింది..

లాన్స్‌నాయక్‌ హోదాలో.. లావేటి ఉమామహేశ్వరరావు 2020 జూలై 18న లద్దాఖ్‌లోని బటాలిక్‌ సెక్టార్‌లో టెర్రరిస్టులు అమర్చిన బాంబులను నిర్వీర్యం చేస్తుండగా.. బాంబు పేలి వీర మరణం పొందాడు. దీంతో జవాన్‌ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.50 లక్షలను విడుదల చేశారని ధర్మాన పేర్కొన్నారు. అలాగే దేశ భద్రత కోసం ప్రాణాలు త్యాగం చేసిన జవాన్‌ కుటుంబానికి అండగా ఉంటామని ఉపముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

పరిహారం అందిందిలా..

జవాన్​కు​ భార్య నిరోష, 11 ఏళ్లు, మూడేళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయినందున ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆదుకోవాలంటూ గతేడాది డిసెంబరులో నిరోష ఏపీ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై సీఎంవో ఈ ఏడాది జనవరిలో జిల్లా అధికారుల నుంచి విచారణ నివేదిక కోరింది. ఆస్తిపాస్తుల్లేని ఆ కుటుంబాన్ని సీఎంఆర్‌ఎఫ్‌ కింద ఆదుకోవాలంటూ అప్పటి శ్రీకాకుళం కలెక్టర్‌ జె.నివాస్‌ ఈ ఏడాది ఫిబ్రవరి 24న ప్రతిపాదించారు. ఇప్పటికి ఆ కుటుంబానికి పరిహారం అందింది.

ఇదీ చదవండి:

17 కిలోల బంగారం, రూ.5 లక్షలు చోరీ!

'చంపడానికి ప్రయత్నిస్తే కేసు నమోదు చేయరా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.