కోల్కతా నుంచి ఫలక్నామా రైలుపై వచ్చి... ఇచ్ఛాపురంలో దిగిన 15 మందిని అధికారులు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం లక్ష్మీపురం క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. అయితే కేంద్రానికి తరలిస్తున్న సమయంలో... వెళ్లే మార్గం తెలియక డ్రైవర్ ఇబ్బంది పడుతున్నాడని వాహనంలోని ఓ యువతి 100కు కాల్ చేసి చెప్పడం వల్ల సంతబొమ్మాళి పోలీసు కానిస్టేబుల్ సత్యరాజ్కు జిల్లా పోలీసు కార్యాలయం నుంచి సమాచారం అందింది. కానిస్టేబుల్ సాయంతో వారంతా అర్ధరాత్రి సమయంలో కేంద్రానికి చేరుకున్నారు.
![constable suspended due to shifting a woman from quarantine to police quarters](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7508873_443_7508873_1591473019065.png)
అయితే అక్కడ సదుపాయాలు లేవని ఆ యువతి సెల్ఫీ వీడియోను జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కరోనా సహాయ కేంద్రానికి అర్ధరాత్రి 2 గంటల సమయంలో పంపించింది. సంబంధిత కానిస్టేబుల్కు కూడా వీడియో పంపటంతో ఆ సమయంలో ఆమెను పోలీసు క్వార్టర్స్కి సత్యరాజ్ తరలించాడు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులకు సమాచారం అందడం వల్ల వారు ఆగ్రహించి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై టెక్కలి ఆర్డీవో కిశోర్ విచారణ జరిపి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటన ఈ నెల 3వ తేదీన జరిగింది. విచారణ అనంతరం కానిస్టేబుల్ను శనివారం సస్పెండ్ చేశారు.
ఇదీ చదవండి : డాక్టర్ సుధాకర్ కేసు: కేజీహెచ్లో సీబీఐ విచారణ