ETV Bharat / state

డ్రైనేజీ పనులు పూర్తిచేయండి: కలెక్టర్​కు హైకోర్టు ఆదేశం

author img

By

Published : Jul 23, 2020, 3:02 AM IST

శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం అలుదు గ్రామంలోని సర్వేనంబరు 460-9, 461లో డ్రైనేజీ పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆ జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ విషయమై సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలిచ్చి నెలరోజుల్లో డ్రైనేజీ పనులు పూర్తి చేయాలని తేల్చి చెప్పింది. అక్కడి ఆక్రమణల తొలగింపు విషయంలో పిటిషనర్లు దరఖాస్తు చేస్తే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ కె.లలితతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.

Complete drainage works: High Court order to Collector
కలెక్టర్​కు హైకోర్టు ఆదేశం

శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం అలుదు గ్రామంలో డ్రైనేజీ స్థలం ఆక్రమణలకు గురైందని, ఈ వ్యవహారంపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆ గ్రామానికి చెందిన బాబురావు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. మరోవైపు భారీ వర్షాలకు మురుగు నీరు, కొండపై నుంచి వచ్చే నీరు ఇళ్లలోకి ప్రవేశిస్తోందని, అసంపూర్తిగా మిగిలిన డ్రైనేజీ పనుల్ని పూర్తిచేసేలా అధికారుల్ని ఆదేశించాలని కోరుతూ... గరీబ్ గైడ్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు భార్గవి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ రెండు వ్యాజ్యాలపై సంయుక్తంగా విచారణ జరిపిన ధర్మాసనం... నెల రోజుల్లో డ్రైనేజీ పనుల్ని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్​ను ఆదేశించింది.

ఇదీ చదవండీ... ఆస్తుల వేలం కొత్తది కాదు: మిషన్ బిల్డ్ ఏపీ డైరెక్టర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.