శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి పోలీసుస్టేషన్లో ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్పై కేసు నమోదైంది. సోమవారం సరుబుజ్జిలి ఎంపీడీవో కార్యాలయంలో వివాదస్పద వ్యాఖ్యలు చేశారని... కూన రవికుమార్తో పాటు మరో 11మందిపై కేసు నమోదు చేసినట్లు ఆమదాలవలస సీఐ ప్రసాదరావు తెలిపారు. రవికుమార్తో పాటు కేసులో ఉన్న 11 మందిని అరెస్టు చేసేందుకు పోలీసులు బృందాలుగా విడిపోయి గాలించారు. సభాపతి తమ్మినేని సీతారాం... ఆయన కుమారుడు కలిసి తనను ఇబ్బంది పెడుతున్నారని కూన రవికుమార్ పేర్కొన్నారు.
ఇదీ చదవండీ...రాజధాని భూముల్లో అనేక అక్రమాలున్నాయి: బొత్స