ETV Bharat / state

ఛాయ్ దుకాణానికి ఎలుగుబంటి.. పిల్లలతో సహా వచ్చేసింది!

author img

By

Published : Aug 9, 2022, 4:07 PM IST

bears
ఎలుగుబంట్ల బీభత్సం

Bears coming into villages: శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంట్లు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇటీవల వీటి దాడిలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా.. ఓ ఛాయ్ దుకాణంలో పిల్లలతో కలిసి ఎలుగుబంటి సంచరిస్తున్న వీడియో వైరల్​గా మారింది.

People panic in srikakulam: శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో ఎలుగుబంట్ల సంచారం కలకలం రేపుతోంది. మందస, వజ్రపుకొత్తూరు మండలాల పరిధిలో ఇటీవల ఎలుగుబంట్ల సంచారం పెరిగిపోయింది. వాటి దాడిలో వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన పలువురు మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలుగుబంట్ల సంచారం ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. తాజాగా.. ఓ టీ దుకాణంలో పిల్లలతో కలిసి ఎలుగుబంటి తిరుగుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. దీంతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు.

ఛాయ్ దుకాణానికి ఎలుగుబంటి.. పిల్లలతో సహా వచ్చేసింది!

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.