ETV Bharat / state

ధాన్యం కొనుగోలుకు అవగాహన సదస్సు

author img

By

Published : Dec 18, 2020, 2:58 PM IST

seminor
అవగాహన సదస్సు

నాణ్యతా ప్రమాణాలను విస్మరించకుండా ధాన్య సేకరణ చేపట్టాలని జిల్లా పౌరసరఫరాల మేనేజర్​ రామనుజమ్మ అన్నారు. ప్రకాశం జిల్లాలో ధాన్యం కొనుగోలు అంశంపై ఆమె అవగాహన సదస్సు నిర్వహించారు.

ధాన్యం సేకరణలో నాణ్యతా ప్రమాణాలను విస్మరించకుండా పనిచేయాలని జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్‌ రామనుజమ్మ పేర్కొన్నారు. నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ధాన్యం కొనుగోలు అంశంపై వ్యవసాయ శాఖ సిబ్బంది, డీఆర్​డీఏ సిబ్బంది, గ్రామ సమాఖ్య సభ్యులతో అవగాహన సదస్సు నిర్వహించారు. టీసీఎస్​ సాంకేతిక సహకారంతో కొనుగోలు కార్యక్రమం నిర్వహిస్తున్నామని... తేమ శాతం, వ్యర్థ పదార్థాలు, కల్తీ రకాల వంటివి శాస్త్రీయ పద్ధతిలో గుర్తించాలని, రైతుకు మేలు జరిగే విధంగా వ్యవహరించాలని మేనేజర్​ పేర్కొన్నారు.

జిల్లాలో ప్రాథమిక పరపతి సంఘాలు, పొగాకు ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య , వెలుగు సంస్థల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. టీసీఎస్​ ప్రతినిధి బృందం కొనుగోలు కేంద్రాల సిబ్బందికి శిక్షణ ఇచ్చారు.

ఇదీ చదవండి : పుంజుకుంటున్న గ్రానైట్‌ క్వారీలు... వీరికి పని లేదు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.