ETV Bharat / state

Red Sandal: ఎర్రచందనం రవాణా గుట్టు రట్టు.. వ్యక్తి అరెస్టు.. 24 దుంగలు స్వాధీనం

author img

By

Published : Jul 27, 2021, 8:40 AM IST

ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న వ్యక్తిని ప్రకాశం జిల్లా మార్టూరు పోలీసులు బొల్లాపల్లి టోల్‌ప్లాజా వద్ద పోలీసులు పట్టుకున్నారు. వాహనంతోపాటు 24 దుంగలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన సరుకు విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుందని తెలిపారు.

red sandal thief arrested
24 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

కడప జిల్లా మైదుకూరుకు చెందిన సంగటిపల్లి జయరాముడు రవాణా వాహనాలు నడపడంలో మంచి అనుభవజ్ఞుడు. వ్యసనాలకు బానిసై ఎర్రచందనం రవాణా చేసే ముఠాతో పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో చోరీలు చేసి... ఎర్రచందనం దుంగలు రవాణా చేయడం అలవాటు చేసుకున్నాడు.

ఈ క్రమంలో బద్వేలుకు చెందిన కొందరితో కలిసి బొలెరో వాహనంలో ఎర్రచందనం దుంగలు తరలిస్తుండగా... ప్రకాశం జిల్లా బొల్లాపల్లి టోల్‌ప్లాజా వద్ద పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. వాహనంలో ఉన్న 24 దుంగలు స్వాధీనం చేసుకుని వాహనాన్ని సీజ్ చేశారు. పట్టుబడిన సరుకు విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుందని ఇంకొల్లు సీఐ పి.సుబ్బారావు తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించిన సీఐ, ఎస్సైలను ఎస్పీ మలికా గార్గ్‌, డీఎస్పీ శ్రీకాంత్‌ అభినందించారు.

ఇదీ చదవండి:

నాలుగు సార్లు సీఎం.. కానీ ఎన్నడూ ఐదేళ్లు ఉండలేదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.