ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న ఉల్లి కోసం ప్రజలు గంటలతరబడి వేచి ఉంటున్నారు. కేవలం ఒక కేజీ ఉల్లిపాయలు మాత్రమే ఇవ్వడం పట్ల నగరవాసులు అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు కిలోలైనా ఇస్తే వారం రోజులు ఇబ్బంది లేకుండా ఉంటుందని మహిళలు అంటున్నారు. బయట ఉల్లి కొనే పరిస్థితి లేదని... ప్రభుత్వం తగినంత సరఫరా చేయాలని కోరారు. కిలో ఉల్లి రూ.25కే రైతు బజార్లలో ఉదయం 7 గంటల నుంచి 10 వరకు, సాయంత్రం 4గంటల నుంచి 6 గంటల వరకు అందిస్తున్నారు.
ఇదీ చూడండి