ETV Bharat / state

రోడ్డు ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే రాంబాబు సాయం

author img

By

Published : Oct 26, 2020, 8:48 AM IST

రోడ్డు ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే అన్నా రాంబాబు సహాయం చేశారు. ప్రకాశం జిల్లా కంభం రహదారిపై జరిగిన ప్రమాదంలో గాయపడిన వారిని సొంత ఖర్చులతో ఒంగోలు రిమ్స్​కు తరలించారు.

prakasam road accident
కంభం రోడ్డు ప్రమాదం

ప్రకాశం జిల్లాలోని కంభం సమీపంలోని కంభం చెరువును సందర్శించడానికి.. ఓ విశ్రాంత ఆర్మీ ఉద్యోగి కుటుంబంతో బయలుదేరారు. మార్కాపురం నుంచి ఇన్నోవా వాహనాన్ని అద్దెకు తీసుకున్నారు. తిరుగు ప్రయాణంలో.. వారి వాహనం కంభం రహదారిపై నున్న హీరో షోరూమ్ వద్ద డివైడర్​ను ఢీకొంది. ఈ ఘటనలో 10 మందికి తీవ్ర గాయాలు కాగా.. వారి వెనుక వస్తున్న గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు గమనించి సహాయం అందించారు. 108 వాహనం​లో కంభం ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం వారిని ఒంగోలు రిమ్స్​కు పంపించాలని వైద్యులు ఎమ్మెల్యేకు తెలిపారు. తన సొంత ఖర్చుతో ఆయన అంబులెన్స్ ఏర్పాటు చేసి.. బాధితులను తరలించారు.

ఇదీ చదవండి:

పేలిన గ్యాస్ సిలిండర్.. వ్యక్తికి తీవ్రగాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.