ETV Bharat / state

తక్కువ ధరకే బంగారం అంటూ మోసం.. ముఠా అరెస్ట్

author img

By

Published : Oct 27, 2021, 12:54 PM IST

ఎలాగోలా పరిచయం అయ్యాడు. తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానని నమ్మించాడు. ఆర్మీ ఉద్యోగి అయినప్పటికీ మోసాన్ని గ్రహించలేక పోయిన ఆవ్యక్తి అతనితో వెళ్లాడు. మరి కొందరితో కలిసి ఆ ఉద్యోగిపై దాడి చేసి నగదుతో ఉడాయించాడు. ఆర్మీ ఉద్యోగి ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు వారిని కటకటాల్లోకి పంపించారు. ఇలాంటి వారితో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు.

gold cheating case
gold cheating case

తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామని మోసగించి దాడిచేసి నగదు లాక్కొని పారిపోయిన ముఠాను గుంటూరు జిల్లా బాపట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్​లో ఈ ఘటనకు వివరాలను డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు.

ఒంగోలు పట్టణం మంగమూరు డొంక ప్రాంతానికి చెందిన నల్లమోతు కిరణ్ ఆర్మీలో పని చేసి రిటైరయ్యారు. ప్రస్తుతం ఇనుము, సిమెంట్ వ్యాపారం చేస్తున్నారు. అతనికి నందు అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ప్రతాప్ అనే వ్యక్తి దగ్గర తక్కువ రేటుకు బంగారం ఇప్పిస్తానని కిరణ్​ను నమ్మించాడు. గత నెల 27వ తేదీన కిరణ్​ను బాపట్ల మండలం కంకటపాలెం ప్రాంతానికి తీసుకు వెళ్లాడు. అనుమానం వచ్చిన కిరణ్ బంగారం ఎక్కడ అని ప్రశ్నించగా.. అక్కడ నుంచి కొత్తపాలెం శివారుకి తీసుకెళ్లాడు. అక్కడికి ముగ్గురు చేరుకుని వారి వద్ద ఉన్న బంగారాన్ని చూపించారు.

పోలీసులమంటూ బెదిరించి..

కొంతసేపటికి మరో ముగ్గురు అక్కడికి చేరుకున్న మరో ముగ్గురు తాము పోలీసులమంటూ.. బెదిరించి కిరణ్​పై దాడిచేసి అతని వద్ద ఉన్న 6 లక్షల 10 వేల రూపాయలు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వారి ఆట కట్టించారు. ఆరుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 3 లక్షల 60 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నామన్నారు. మరో నలుగురిని అరెస్ట్ చేయాల్సి ఉందని చెప్పారు.

ఇదీ చదవండి: FACEBOOK FRIENDSHIP: ప్రాణం మీదకు తెచ్చిన ఫేస్‌బుక్‌ పరిచయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.