ETV Bharat / state

దెబ్బతిన్న పంటలను పరిశీలించిన గిద్దలూరు ఎమ్మెల్యే

author img

By

Published : Nov 29, 2020, 7:31 PM IST

నివర్ తుపానుకు పాడైన పంటలను.. గిద్దలూరు ఎమ్మెల్యే వెంకట రాంబాబు పరిశీలించారు. ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలంలోని వివిధ గ్రామాల్లో ఆయన పర్యటించారు. సాధ్యమైనంత త్వరగా పంట నష్టం వివరాలు ప్రభుత్వానికి అందించాలని అధికారులకు సూచించారు.

mla visit crop loss
పంట నష్టం పరిశీలిస్తున్న ఎమ్మెల్యే

ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలంలో.. నివర్ తుపాన్ ధాటికి దెబ్బతిన్న పంటలను ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు పరిశీలించారు. పలు గ్రామాల్లో పర్యటించి పంట నష్టం వివరాలను అధికారులు, రైతుల నుంచి తెలుసుకున్నారు.

అధికారులు సాధ్యమైనంత త్వరగా పంట నష్టం వివరాలను సేకరించి.. ప్రభుత్వానికి పంపాలని ఎమ్మెల్యే సూచించారు.. తద్వారా సాయం పంపిణీకి సర్కారు చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

ఇదీ చదవండి:

కార్తిక పౌర్ణమి సందర్భంగా సముద్రంలో స్నానాలు నిషేధం

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.