ETV Bharat / state

'అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచాలి'

author img

By

Published : Sep 17, 2020, 3:30 PM IST

farmers support to amaravathi agitation in ongole
farmers support to amaravathi agitation in ongole

అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలు రంగా భవన్​లో అమరావతి రైతులకు మద్దతుగా సమావేశం నిర్వహించారు. అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని డిమాండ్ చేశారు.

275 రోజులుగా అమరావతిలో రైతులు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారని రైతు సంఘం నాయకులు అన్నారు. భూములిచ్చిన రైతులు న్యాయం కోరుతుంటే.. ముఖ్యమంత్రి పట్టనట్లు వ్యవహరించడం దారుణమని పేర్కొన్నారు. రాజధానిని మూడుముక్కలు చేస్తూ మనిషికో రకంగా ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: రాష్ట్ర వ్యాప్తంగా ఎంసెట్ ప్రారంభం.. 23 వరకు పరీక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.