ETV Bharat / state

పొలంగట్టు విషయంలో ఘర్షణ... ఏడుగురికి గాయాలు

author img

By

Published : Feb 16, 2021, 1:31 AM IST

ప్రకాశం జిల్లా దోర్నాల మండలం కడపరాజుపల్లిలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కొడవళ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ఘర్షణలో గాయపడ్డ యువకుడు
ఘర్షణలో గాయపడ్డ యువకుడు

ప్రకాశం జిల్లా దోర్నాల మండలం కడపరాజుపల్లిలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పాతకక్షలతో పాటు పొలం గట్టు విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం చెలరేగటంతో కొడవళ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఏడుగురు గాయపడ్డారు. చికిత్స నిమిత్తం గాయపడ్డవారిని మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వీరిలో మహాలక్ష్మమ్మ, అంజనేయులుకు తీవ్రగాయాలు కావడంతో మెరుగైన వైద్య కోసం ఒంగోలు రిమ్స్​కు తరలించారు.

ఇదీ చదవండి

వినియోగదారుల్లా వస్తారు... విలువైన వస్తువులను కాజేస్తారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.