ETV Bharat / state

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు దగ్ధం.. ముగ్గురు సజీవదహనం

author img

By

Published : May 17, 2022, 6:54 PM IST

Updated : May 17, 2022, 10:41 PM IST

కారు దగ్ధం
కారు దగ్ధం

18:49 May 17

మార్కాపురం మండలం తిప్పాయిపాలెం వద్ద ప్రమాదం

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు దగ్ధం.. ముగ్గురు సజీవదహనం

ROAD ACCIDENT IN PRAKASAM DISTRICT: వారు ముగ్గురూ ప్రాణ స్నేహితులు.. ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్తుంటారు. అన్ని విషయాలు ఒకరికొకరు పంచుకుంటారు. వారి స్నేహం చూసి విధికి కన్నుకుట్టిందో ఏమో.. ముగ్గురిని ఒకేసారి తీసుకుపోయింది. ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురూ సజీవ దహనమయ్యారు.

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం తిప్పాయపాలెం సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లా కంబం నుంచి మార్కాపురం వైపు వెళుతున్న కారు టైరు పేలి.. లారీని ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన తర్వాత పెట్రోలు ట్యాంక్​కు మంటలంటుకొని.. కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు.

మృతులు భాకరాపేట గ్రామానికి చెందిన ఇమ్రాన్, బాలాజీ, తేజగా గుర్తించారు. వీరిలో ఇమ్రాన్ అనే యువకుడు గుంటూరులోని ఓ ప్రైవేటు టెలికాం డిపార్ట్​మెంట్​కు చెందిన బొలెరో వాహనానికి డ్రైవర్​గా పని చేస్తున్నాడు. ఇమ్రాన్, అతని స్నేహితులు బాలాజీ, తేజ ముగ్గురూ కలిసి మార్కాపురం జాతీయ రహదారిపై కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరు ముగ్గురు ఓకే గ్రామానికి చెందినవారు కావటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతులు ఆ మార్గంలో ఎందుకు ప్రయాణిస్తున్నారన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు.

ఇదీ చదవండి: రాంగ్ రూట్ లో వేగంగా వచ్చి...బైక్ ని ఢీకొన్న మరో బైక్..ఒకరు మృతి...

Last Updated : May 17, 2022, 10:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.