ETV Bharat / state

నేరేడు పండ్ల లోడుతో వెళ్తున్న వాహనం బోల్తా

author img

By

Published : Jul 7, 2021, 1:59 PM IST

నేరేడు పండ్లతో వెళుతున్న బొలెరో వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పండ్లన్నీ నేలపాలయ్యాయి. ప్రకాశం జిల్లామార్టూరు మండలం ఇసుక దర్శి వద్ద ఈ ఘటన జరిగింది.

apricot nut vehicle overturned
నేరేడు కాయల వాహనం బోల్తా

ప్రకాశం జిల్లా మార్టూరు మండలం ఇసుక దర్శి వద్ద బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనంలోని నేరేడు పండ్లు రోడ్డుపై చెల్లాచెదురుగా మారాయి. చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి విజయవాడ వైపు వెళుతున్న ఈ వాహనం యాక్సల్ విరగటంతో అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టంది. ఈ క్రమంలో బొలెరో బోల్తా పడి.. కాయలన్నీ నేలపాలయ్యాయి. ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు. రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా హైవే సిబ్బంది క్రమబద్దీకరించారు.

ఇదీ చదవండీ.. అనకాపల్లిలో వంతెన కూలిన ఘటనపై కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.