ETV Bharat / state

మర్రిపాడులో వాలంటీర్ ఇష్టారాజ్యం...ఆందోళనకు దిగిన బాధితులు

author img

By

Published : Jul 13, 2021, 3:58 PM IST

ఆందోళనకు దిగిన బాధితులు
ఆందోళనకు దిగిన బాధితులు

నెల్లూరు జిల్లా మర్రిపాడులో వాలంటీర్ కత్తి లక్ష్మీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని బాధితులు ఆందోళనకు దిగారు. పంపిణీ చేసే ఫించన్​లో కమిషన్ తీసుకుంటూ వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చబోలు గ్రామంలో వాలంటీర్ కత్తి లక్ష్మీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. వృద్ధులకు, వితంతువులకు పంపిణీ చేసే పింఛన్​లో కమిషన్ తీసుకుంటూ వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో విసుగెత్తిపోయిన బాధితులు గ్రామ వాలంటీర్​ కత్తి లక్ష్మీపై ఇటీవల ఎంపీడీవోకి ఫిర్యాదు చేశారు.

అయితే ఎంపీడీవో పట్టించుకోకపోవడం పట్ల బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కత్తి లక్ష్మీపై వెంటనే చర్యలు తీసుకోవాలని మర్రిపాడు ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.

ఇదీ చదవండి:

CHANDRABABU: 'వైకాపా నేతల అవినీతిపై కేసులు పెడితే విచారణకు కోర్టులు చాలవు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.