నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం దేపూరలోని సాయిబాబా, పెంచల స్వామి ఆలయాల్లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఆలయంలో మద్యం సేవించి హుండీ పగలగొట్టి నగదు దోచుకెళ్లారు. పూజారి ఉదయం వచ్చి చూసేసరికి తాళం తీసి ఉండడాన్ని గమనించి స్థానికులకు సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పరిసర ప్రాంతాల్లోని పొదల్లో పగిలిన హుండీలను గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే బాబా ఆలయంలో గతంలో మూడుసార్లు దొంగతనం జరిగిందని ఆలయ పూజారి తెలిపారు. నెల రోజుల నగదు మొత్తం హుండీలోనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: ఆంజనేయస్వామి ఆలయంలో చోరీ