ETV Bharat / state

దేపూరు వద్ద ఒకేసారి రెండు ఆలయాల్లో చోరీ

author img

By

Published : Oct 30, 2019, 9:03 AM IST

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం దేపూరు వద్ద రెండు దేవాలయాల్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలో మద్యం సేవించి... హుండీలను పగలగొట్టి నగదు దోచుకెళ్లినట్లు పూజారి తెలిపారు.

two-temples-robbery-at-the-same-time-in-dhepuru

దేపూరు వద్ద ఒకేసారి రెండు ఆలయాల్లో చోరీ

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం దేపూరలోని సాయిబాబా, పెంచల స్వామి ఆలయాల్లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఆలయంలో మద్యం సేవించి హుండీ పగలగొట్టి నగదు దోచుకెళ్లారు. పూజారి ఉదయం వచ్చి చూసేసరికి తాళం తీసి ఉండడాన్ని గమనించి స్థానికులకు సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పరిసర ప్రాంతాల్లోని పొదల్లో పగిలిన హుండీలను గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే బాబా ఆలయంలో గతంలో మూడుసార్లు దొంగతనం జరిగిందని ఆలయ పూజారి తెలిపారు. నెల రోజుల నగదు మొత్తం హుండీలోనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: ఆంజనేయస్వామి ఆలయంలో చోరీ

Intro:దేవాలయాల్లో చోరీ


Body:దేవాలయాల్లో వరుస చోరీల తో ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం దేపూరు వద్ద సాయిబాబా మరియు పెంచల స్వామి రెండు దేవాలయాల్లో చోరీకి పాల్పడి అక్కడినుండి హుండీలు పగలగొట్టి నగదు ఎత్తుకెళ్లారు గుర్తుతెలియని వ్యక్తులు సాయంత్రం పొద్దుపోయాక పూజల ముగించుకొని తాళాలు వేసి వెళ్లిన పూజారి ఉదయం వచ్చి చూసేసరికి తాళాలు పగలగొట్టి ఉండడాన్ని గమనించిన పూజారి గ్రామస్తులు సమాచారం ఇచ్చాడు గ్రామస్తులు దేవాలయ పరిసర ప్రాంతాల్లో చూడగా కాస్త దూరం పొదల్లో ఖాళీ హుండీలను గుర్తించారు వాటిని పగలగొట్టి నగదు తీసుకెళ్లినట్టు గ్రామస్తులు తెలుపుతున్నారు నెల రోజుల నుండి నగదు మొత్తం హుండీల ఉందని ఈ దేవాలయాల్లో ఇలా జరగడం మూడోసారి గ్రామస్తులు తెలిపారు ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు


Conclusion:కిట్ నెంబర్ 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు ph 9866307533.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.