ETV Bharat / state

accident: లారీని ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి

author img

By

Published : Aug 23, 2021, 7:56 AM IST

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ద్విచక్రవాహనం ఢీ కొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తలు అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
accident
accident

నెల్లూరు పాలెం సమీపంలోని నెల్లూరు - ముంబయి జాతీయ రహదారిపై ఇంజినీరింగ్ కాలేజీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని వెనకవైపు ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్​పై వెళుతున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

మృతులను ఆత్మకూరు మండలం పడకండ్లకు చెందిన పోస్టల్ ఉద్యోగి వెంకటేశ్వర్లు, బోయళ్ల చిరువెళ్ల గ్రామానికి చెందిన అంకె కిష్టయ్యగా గుర్తించారు. అంకె కిష్ణయ్య నెల్లూరు పాలెం సమీపంలోని హైవే రెస్ట్ ఏరియాలో వాచ్​మెన్​గా పనిచేసేవారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ACCIDENT : ద్విచక్రవాహనం-ఇసుక లారీ ఢీ... ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.