ETV Bharat / state

Accident: వరికుంటపాడు దగ్గర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, ఒకరికి గాయాలు

author img

By

Published : Jul 5, 2021, 6:13 PM IST

నెల్లూరు జిల్లా వరికుంటపాడు సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎదురెదురుగా వస్తున్న కారు, బొలెరో వాహనం ఢీకొనటంతో ప్రమాదం జరిగింది.

two died and one injured in accident occured at varikuntapadu highway in nellore
వరికుంటపాడు జాతీయ రహదారిపై ప్రమాదం.. ఇద్దరు మృతి, ఒకరికి గాయాలు

నెల్లూరు జిల్లా వరికుంటపాడు సమీపంలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో.. ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. 565 జాతీయ రహదారి వరికుంటపాడు సమీపంలో.. ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్నాయి. పామూరు వైపునుంచి వెళ్తున్న కారు, దుత్తలూరు వైపు నుంచి వస్తున్న బొలెరో వాహనం ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో కర్నూలుకు చెందిన పాలూరి సుబ్బారెడ్డి (46), కడపకు చెందిన చిన్నారెడ్డి (42).. కారులో ఇరుక్కుపోయి అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. బొలెరో నడుపుతున్న డ్రైవర్​కు తీవ్ర గాయాలుకాగా.. చికిత్స కోసం పామూరు వైద్యశాలకు తరలించారు.

ఇదీ చదవండి:

కేఆర్​ఎంబీకి తెలంగాణ మరో లేఖ... త్రిసభ్య కమిటీ భేటీ వాయిదాకు వినతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.