ETV Bharat / state

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి

author img

By

Published : Oct 24, 2020, 12:22 PM IST

three men death on road accident in pudi nellore district
నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

నెల్లూరు జిల్లా పూడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనం, ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా... ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు చనిపోయారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తడ మండలంలోని పూడి గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. జాతీయ రహదారిపై ఓ కారు... ద్విచక్రవాహనం, ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. మృతులు నెల్లూరు వాసులుగా పోలీసులు గుర్తించారు. వీరు చెన్నై నుంచి నెల్లూరు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలిలో ఒకరు చనిపోగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృత్యువాతపడ్డారు.

ఇదీచదవండి.

గీతం వర్సిటీ కట్టడాల కూల్చివేతపై చినరాజప్ప ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.