ETV Bharat / state

బ్రేక్‌ రాడ్‌ విరిగిపోవడంతో చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. 40 మంది ప్రయాణికులు క్షేమం

author img

By

Published : Dec 14, 2022, 1:04 PM IST

Updated : Dec 14, 2022, 1:55 PM IST

RTC Bus Accident At Nellore District: ప్రయాణికులను వారి గమ్యస్థలాలకు క్షేమంగా చేర్చే ఆర్టీసీ వ్యవస్థ ఉన్నప్పటికీ.. ప్రయాణ మార్గంలో ఒడిదుడుకులు ఉంటే..ఆ వ్యవస్థ మాత్రం ఎమిచేయగలదు.. అప్పుడప్పుడు ప్రమాదాలకు గురికాక తప్పదు.. ఇలాంటి సంఘటనే నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.

RTC bus accident
ఆర్టీసీ బస్సు ప్రమాదం

RTC Bus Accident At Nellore District: రోడ్డుపై గుంతను తప్పించబోయి..బస్సు బ్రేక్ రాడ్ విరగటంతో..చెట్టును ఢీ కొన్న ఘటన నెల్లూరు జిల్లా మర్రిపాడు వద్ద చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న 40మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. నెల్లూరు నుంచి ఉదయగిరికి వెళుతున్న ఆర్టీసీ బస్సు గుంతను తప్పించబోయి..మరో గుంతలో పడి బ్రేక్‌ రాడ్‌ విరిగిపోవడంతో చెట్టును ఢీకొంది. ప్రయాణికులను మరో బస్సులో గమ్యస్థలానికి సురక్షితంగా చేర్చారు.

బ్రేక్‌ రాడ్‌ విరిగిపోవడంతో చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు

ఇవీ చదవండి:

Last Updated : Dec 14, 2022, 1:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.