ETV Bharat / state

బస్సు-కారు ఢీ... ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు

author img

By

Published : Mar 9, 2021, 10:20 PM IST

నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రేగడచెలిక జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

బస్సు, కారు ఢీ... ఒకరు మృతి... ముగ్గురికి గాయాలు...
బస్సు, కారు ఢీ... ఒకరు మృతి... ముగ్గురికి గాయాలు...

నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రేగడచెలిక జాతీయ రహదారిపై కారు, ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ప్రకాశం నుంచి నెల్లూరు వైపు వస్తున్న కారు.. లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వేణుగోపాల్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కారులో చిక్కుకున్న బాధితులను.. అతికష్టం మీద స్థానికులు బయటకు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కొడవలూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:

నెల్లూరులోని కుసుమ హరిజనవాడలో రెండు వర్గాల మధ్య ఘర్షణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.