ETV Bharat / state

'2021 జులై నాటికి నెల్లూరులో భూముల రీ సర్వే పూర్తి'

author img

By

Published : Dec 21, 2020, 6:07 PM IST

land re-survey
భూముల రీ సర్వే

నెల్లూరు జిల్లాలోని రెడ్డిగుంట గ్రామంలో భూముల రీ సర్వే కార్యక్రమం ప్రారంభమైంది. 2021 జులై నాటికి జిల్లాలోని అన్ని గ్రామాల్లో సర్వే పూర్తి చేస్తామని జిల్లా సంయుక్త కలెక్టర్ తెలిపారు.

నెల్లూరు జిల్లా రెడ్డిగుంట గ్రామంలో భూముల రీ సర్వేను అధికారులు ప్రారంభించారు. కార్యక్రమానికి జిల్లా సంయుక్త కలెక్టర్ హరేంద్రప్రసాద్, సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ, ఇతర అధికారులు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కార్యక్రమం చేపట్టిందన్నారు.

ఈ కార్యక్రమాన్ని గూడూరు డివిజన్ పరిధిలో ప్రారంభించామని సంయుక్త కలెక్టర్ హరేంద్రప్రసాద్ తెలిపారు. 2021 జులై నాటికి జిల్లాలోని నాలుగు వందల గ్రామాల్లో భూ సర్వే పూర్తి చేసి... ప్రజల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. రేపు గ్రామంలో భారీ సభ నిర్వహిస్తామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

మంత్రి అనిల్ కాన్వాయ్​ని అడ్డుకున్న ఏబీవీపీ నేతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.