ETV Bharat / state

పుకార్లు నమ్మొద్దు.. కందలేరుపై గ్రామస్థులకు అధికారులు కౌన్సిలింగ్

author img

By

Published : Nov 30, 2020, 8:48 AM IST

minister anil kumar yadav comments
కందలేరుపై గ్రామస్థులకు అధికారులు కౌన్సిలింగ్

కందలేరు జలాశయం కట్ట తెగుతుందనే పుకార్లను నమ్మొద్దంటూ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కోరారు. తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. కట్ట తెగుతుందనే భయంతో ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లేవారికి పోలీస్ అధికారులు కౌన్సిలింగ్​ ఇస్తున్నారు.

కందలేరు జలాశయానికి సంబంధించి కొంతమంది కావాలని పుకార్లను పుట్టిస్తున్నారని వాటిని నమ్మొద్దని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. జలాశయానికి సంబంధించి పుకార్లు పుట్టించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. నెల్లూరు జిల్లా కందలేరు డ్యామ్ కట్ట తెగిపోతుందని జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని పోలీసులు స్థానికులను కోరారు. అవన్నీ పుకార్లని అధికారులు తెలిపారు. కట్ట తెగిపోతుందనే భయంతో కడలేరుకు దిగువన ఉన్న గ్రామస్థులు.. పొదలకూరుకు చేరుకుంటున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామాలకు వెళ్లి స్థానికులకు ధైర్యం చెబుతూ.. కౌన్సిలింగ్ ఇస్తున్నారు.

ఇవీ చూడండి...

జలధార...కొట్టకుండానే బోరింగ్ నీళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.