ETV Bharat / state

చెరువును తలపిస్తున్న నెల్లూరు - లోతట్టు ప్రాంతాలు జలమయం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 4, 2023, 7:37 PM IST

michaung_cyclone_effect_in_nellore
michaung_cyclone_effect_in_nellore

Michaung Cyclone Effect In Nellore: రాష్ట్రంలో మిగ్​జాం తుపాను ప్రభావంతో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగర ప్రాంతాల్లో ప్రజలు బయటకు రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో అధిక వర్షపాతం నమోదు కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Michaung Cyclone Effect In Nellore

Michaung Cyclone Effect In Nellore: మిగ్​జాం తుపాను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. నెల్లూరు జిల్లాలో తుపాను ప్రభావంతో నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నెల్లూరు, కావలి పట్టణంలో భారీగా వర్షపాతం నమోదైంది. తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు నెల్లూరు నగరం చెరువును తలపిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.ప్రధాన రహదారులపై మోకాలి లోతు నీళ్లు చెరాయి. నిన్నటి నుంచి నెల్లూరు జిల్లాలో ఈ తుపాను ప్రభావం అధికంగా ఉంది. తుమ్మలపెంట, పెదపట్టుపాలెం, కొత్తసత్రం వంటి పలు ప్రాంతాల్లో సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఇప్పటికే మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలోకి చేపల వేటకు వెళ్లకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జాలర్లు ఉపయోగించే పడవలు, వలలు వంటివి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

దూసుకొస్తున్న మిగ్​జాం తుపాను- ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు

Rain Water Coming In Roads: నెల్లూరు నగర శివారు ప్రాంతాలైన ఆర్టీసీ కాలనీ, తల్పగిరి కాలనీ, చంద్రబాబు నగర్, వైఎస్ఆర్ నగర్ ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. మోకాలి లోతు నీళ్లు చేరడంతో నివాసాల్లోని ప్రజలు బయటకు రాలేక ఇబ్బందులు పడుతున్నారు. నగర నడిబొడ్డులో ఉన్న గాంధీ బొమ్మ సెంటర్​లో స్థానిక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు దిగువ ప్రాంతాలను ముంచెత్తుతోంది. నగరంలో ఉన్న అండర్ బ్రిడ్జిల్లోకి ఒక్కసారిగా భారీగా నీరు రావటంతో పలు వాహనాలు అందులోనే చిక్కుకుపోయాయి. భారీ వర్షం కురవడంతో డ్రైనేజీలు చిన్నవిగా ఉండటంతో వర్షపునీరు బయటకు పోవడంలేదు. మిషన్​లతో కాలువల్లో పూడికలు తీయిస్తు నీటిని బయటకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకా రెండు రోజులు పాటు భారీ వర్షాల సూచన ఉండటంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

Cyclone Effect in Crops: ప్రధానంగా తీర ప్రాంతలైన ముత్తుకూరు, ఇందుకూరుపేట, తోటపల్లి, గూడూరు, కొడవలూరు, విడవలూరు మండలాలలో వరి, వేరుశనగ, కూరగాయలు వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయినట్లు తెలిపారు. ఇంకా ఇలాగే వర్షం కొనసాగితే భారీ ఎత్తున నష్టం జరుగుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు.

భారీగా వర్షాలు, రైలు పట్టాలపై నీరు-మిగ్‌జాం తుపానుతో స్తంభించిన రవాణా వ్యవస్థ!

Residents Of Low-Lying Areas: ఇప్పటి వరకు నెల్లూరులో 25.4 సెం.మీ వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాల వాసులను తరలించేందుకు పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. తీర ప్రాంతాల్లో 70 పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. కావలి తీరంలో అన్ని సహాయక చర్యలపై అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. నెల్లూరు తీర ప్రాంతాలను జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పునరావాస కేంద్రాల్లో ఉన్న వారిని పరామర్శించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.