ETV Bharat / state

నీటిలో దాచారు... అధికారులు పట్టుకున్నారు

author img

By

Published : Jun 1, 2020, 5:01 PM IST

నెల్లూరు జిల్లా వెంకటాద్రిపాలెంలో నీటిలో దాచిన ఎర్రచందనం దుంగలను సంబంధిత అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Illeagal red sandal seize in venkatadripalem nellore district
నీటిలో దాచిన ఎర్ర చందనం దుంగలను పట్టుకున్న అధికారులు

నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలోని వెంకటాద్రిపాలెం క్వారీలోని నీళ్లలో అక్రమంగా నిల్వ ఉంచిన ఎర్రచందనం దుంగలను ఆత్మకూరు అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తెల్లవారుజాము నుంచి తనిఖీలు నిర్వహించి, అక్రమంగా నిల్వ ఉంచిన 107 ఎర్రచందనం దుంగలను సీజ్ చేశామని డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ తెలిపారు. వీటిని ఆత్మకూరు రేంజ్ ఆఫీస్​కు తరలిస్తామని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామన్నారు.

ఇదీచదవండి.

ఏడాదిలో అప్పుల ఆంధ్రప్రదేశ్​గా మార్చేశారు: జనసేన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.