నెల్లూరు జీజీహెచ్లో ఉన్న మార్చురీ.. ప్రస్తుత అవసరాలకు సరిపోవడం లేదు. సర్వజన ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న 8 ఫ్రీజర్లు సైతం అవసరాలు తీర్చడం లేదు. కొవిడ్ కారణంగా సగటున ప్రతిరోజూ ఎనిమిది మందికిపైగా మృత్యువాత పడుతున్నారు. మృతుల వివరాలను కుటుంబ సభ్యులకు, బంధువులకు సమాచారం ఇవ్వడంలోనూ ఆలస్యం నెలకొంటోంది.
4 రోజుల సమయం..
మార్చురీ నుంచి బయటకు తరలించేసరికే సుమారు 4 రోజులకుపైగా సమయం పడుతుండటం కలవరపెట్టే అంశం. ఫ్రీజర్లు లేక, గదులు లేక దేహాలు కుప్పలుగా పడి ఉంటున్నాయి. 20కి పైగా శవాలను గదిలోనే కుప్పలుగా పడేస్తున్నారు. 4 రోజుల అనంతరం మృత దేహం డీ కంపోజ్ అవుతుండటం సమస్యగా మారింది. నెల్లూరు నగరంలోని బొడిగాడి తోట శ్మశానంలో వసతులు లేక ఖననం చేసేందుకూ ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ యంత్రం ఏర్పాటు చెస్తే మృతదేహాన్ని కాల్చివేయడం సౌకర్యంగా ఉంటుందని ప్రజలు కోరుతున్నారు.
ఇవీ చూడండి: