ETV Bharat / state

నెల్లూరు జిల్లాలో విషాదం.. ప్రియుడి మృతి తట్టుకోలేక ప్రియురాలు ఆత్మహత్య

author img

By

Published : Aug 14, 2021, 12:49 PM IST

Updated : Aug 14, 2021, 3:05 PM IST

ప్రియుడి మృతి తట్టుకోలేక ప్రియురాలు ఆత్మహత్య
ప్రియుడి మృతి తట్టుకోలేక ప్రియురాలు ఆత్మహత్య

12:46 August 14

విషపు గుళికలు మింగి..

నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గ్రామనత్తం గ్రామంలో విషాదం చోటు జరిగింది. గ్రామానికి చెందిన శ్రీకాంత్, సౌమ్య గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఉపాధి కోసం శుక్రవారం ఆత్మకూరుకు వెళ్లిన శ్రీకాంత్ విద్యుదాఘాతంతో మృతి చెందాడు.

ప్రియుడి మృతితో మనస్థాపం చెందిన అతడి ప్రియురాలు సౌమ్య అర్థరాత్రి విషపు గుళికలు మింగి ఆత్మహత్య చేసుకుంది. వీరి మృతితో ఇద్దరి కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

Jagtial News: రాత్రంతా శవానికి పూజలు.. ఇక బతికిరాడని చివరికి ఏం చేశారో తెలుసా?

Last Updated : Aug 14, 2021, 3:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.