రబీ సీజన్లో జిల్లాలో ఏడు లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేశారని నెల్లూరు జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు సలహాలు-సూచనలు ఇవ్వడంతో రైతులు మంచి దిగుబడి సాధిస్తున్నారన్నారు. రైతుల కోసం ప్రభుత్వం 165 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, ఆ కేంద్రాల్లోనే ధాన్యం అమ్ముకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో చాలామంది రైతులకు ప్రధానమంత్రి కిసాన్ కార్డులు అందలేదని, బ్యాంకు అధికారులను సంప్రదించి కిసాన్ కార్డులు తీసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
ఇవీ చూడండి...