ETV Bharat / state

ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. ముగ్గురికి గాయాలు

author img

By

Published : Jul 27, 2021, 8:28 PM IST

clashes
కర్రలు, కత్తులతో దాడి

అధికార పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇందులో ఓ వర్గానికి చెందిన వ్యక్తులు కర్రలు, కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు.

తూర్పు గోదావరి జిల్లా యు కొత్తపల్లి మండలం ఉప్పాడ చేపల రేవులో అధికార పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇందులో ఓ వర్గానికి చెందిన వ్యక్తులు కర్రలు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. చేపల రేవులో నూతన హార్బర్ నిర్మాణం పనుల విషయంలో వివాదం తలెత్తింది. గత గడిచిన పంచాయతీ ఎన్నికల గొడవలకు సంబంధించి పాత కక్షల కారణంగానూ.. ఈ వివాదం జరిగి ఉంటుందని సమాచారం.

ఇదీ చదవండీ.. murder: ఆధిపత్య పోరులో సర్పంచ్ దారుణ హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.