ETV Bharat / state

'గడప గడపకు' నిరసన సెగ.. మంత్రి అంబటిని నిలదీసిన మహిళ

author img

By

Published : Jun 8, 2022, 9:57 PM IST

మంత్రి అంబటిని నిలదీసిన మహిళ
మంత్రి అంబటిని నిలదీసిన మహిళ

Ambati: గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబుకు సమస్యలు స్వాగతం పలికాయి. కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో తన సోదరుడి పింఛన్ ఎందుకు తొలగించారంటూ ఓ మహిళ మంత్రి అంబటిని నిలదీశారు.

గడపగడపలో ప్రజాప్రతినిధులకు సమస్యల సెగ తప్పడం లేదు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అంబటి రాంబాబుకు నిరసన సెగ తగిలింది. తన సోదరుడి పింఛన్ ఎందుకు తొలగించారంటూ ఓ మహిళ మంత్రి అంబటిని నిలదీశారు. తెలుగుదేశం హయాంలో వికలాంగుడికి నెలనెలా పింఛన్ వచ్చేదని.. వైకాపా అధికారంలోకి వచ్చాక పింఛన్ తొలగించారని ఆవేదన వ్యక్తం చేసింది.

వాలంటీర్ ఉద్దేశ్యపూర్వకంగా పింఛన్ నిలిపివేశారంటూ మంత్రి దృష్టికి తీసుకెళ్లగా 'తొందరపడితే ఎలా ? తర్వాత వస్తుంది లే...' అంటూ మంత్రి అక్కడినుంచి మెల్లగా జారుకున్నారు. సరైన సమాధానం చెప్పకుండానే మంత్రి వెళ్లిపోయారని వికలాంగుడు ఆవేదన వ్యక్తం చేశారు.

మంత్రి అంబటిని నిలదీసిన మహిళ

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.