ETV Bharat / state

ఆన్​లైన్​ మోసాలకు తెరలేపిన యువకుడు ​- చివరకు పోలీసుల చేతికి

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 23, 2023, 10:57 PM IST

Updated : Nov 24, 2023, 6:20 AM IST

Online Fraud Committed Person Arrested: అన్​లైన్​లో మోసాలకు పాల్పడిన ఓ వ్యక్తిని పల్నాడులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు మోసాలకు పాల్పడిన తీరు తెలిస్తే ఆశ్యర్యమేస్తోంది. అన్​లైన్​లో మనీ సెండ్​ చేయమని.. చేసిన తర్వాత చెక్​ చేసుకునే క్రమంలోనే మోసానికి పాల్పడేవాడు. ఇలా దాదాపు 11 లక్షల వరకు మోసం చేసి.. చివరకు పల్నాడు జిల్లా పోలీసుల చేతికి చిక్కాడు.

Online_Fraud_Committed_Person_Arrested
Online_Fraud_Committed_Person_Arrested

Online Fraud Committed Person Arrested: వ్యసనాలకు అలవాటు పడిన ఓ యువకుడు.. మోసాలకు తెరలేపాడు. ఈజీ మనీ కోసం అన్​లైన్​ పేమెంట్​ మార్గాన్నే మోసాలకు మార్గంగా ఎంచుకున్నాడు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోసాలకు పాల్పడగా.. చివరికి పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు. దాదాపు రూ. 11లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లాలోని రాజుపాలెం మండలం అంచులవారిపాలెం గ్రామానికి చెందిన.. వేపూరి శరత్ బాబు అనే యువకుడు అన్​లైన్​ గేమ్​లకు అలవాటుపడ్డాడని తెలిపారు. ఇంటర్​ మొదటి సంవత్సరంలోనే విద్యను మానేసిన శరత్ బాబు​.. అన్​లైన్​ గేమ్​లకు బానిసగా మారినట్లు వివరించారు. ఈ క్రమంలో అతను జూదం, క్రికెట్​లో బెట్టింగ్​ వంటి వాటిలో నగదు అధికంగా వస్తుందని తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో వాటిలో బెట్టింగ్​లు పెట్టేవాడని వివరించారు. ఈ బెట్టింగ్​ల కోసం నగదు అవసరం కావడంతో.. మోసాలకు తెరలేపినట్లు వివరించారు.​

Cyber Crime in Vijayawada: విజయవాడలో పేట్రేగిపోతున్న సైబర్ నేరగాళ్లు.. ఆకర్షణీయ ప్రకటనలపై కాస్త ఆలోచించాల్సిందే!

మోసం చేసే తీరు తెలిస్తే ఆశ్చర్యమే : మోసాలకు పాల్పడేందుకు అతను జనం అధికంగా ఉండే ప్రాంతాలను ఎంచుకునేవాడని వివరించారు. జనప్రవాహం అధికంగా ఉన్న ప్రాంతాల్లోని ఏదైనా షాపునకు వెళ్లి.. ఆ షాప్​లోని వస్తువులు కొనుగోలు చేసేవాడని తెలిపారు. ఈ క్రమంలో వారికి నగదు చెల్లించేందుకు.. యాజమాని ఫోన్​ నుంచి ఆన్​లైన్​లో తనకు ఒక రూపాయి సెండ్​ చేయమని అడిగేవాడని అన్నారు. వారు అతను చెప్పినట్లుగానే రూపాయి సెండ్​ చేసే క్రమంలో.. పాస్​వర్డ్​ను గమనించేవాడని వెల్లడించారు.

యాజమాని నగదు సెండ్​ చేసిన తర్వాత కొంత సమయం తీసుకుని.. తన వాళ్లకు చేరిందో లేదో చూసుకుంటానని అడిగేవాడని తెలిపారు.​ ఇలా దుకాణాదారుడి ఫోన్​ తీసుకునే వాడని వివరించారు. ఫోన్​ తీసుకున్న తర్వాత దుకాణ యాజమాని వేరే పనిలో ఉండడాన్ని చూసి.. యాజమాని ఖాతా ఓపేన్​ చేసి నగదు తనకు సెండ్​ చేసుకునేవాడని పేర్కొన్నారు.

అనంతరం ఫోన్​ తిరిగి ఇచ్చేసి తన వాళ్ల ఖాతా పని చేయడం లేదని తెలిపేవాడని వివరించారు. తర్వాత వారికి ఏటీఎం నుంచి నగదు తీసుకువచ్చి చెల్లిస్తానని చెప్పి అక్కడి నుంచి జారుకునే వాడని పోలీసులు వివరించారు. ఇలా ఇప్పటి వరకు 11లక్షల రూపాయల వరకు మోసాలకు పాల్పడినట్లు వెల్లడించారు.

Bank Account OTP fraud : బ్యాంకింగ్ అలర్ట్.. ఓటీపీ కూడా కొట్టేస్తున్నారు! ఇలా చేస్తేనే సేఫ్​

యువకుడి మోసాలకు అడ్డుకట్ట వేసిన పోలీసులు: మోసాలకు పాల్పడుతున్న శరత్​బాబు వినుకొండలో సంచరిస్తున్న సమయంలో పోలీసుల కంటపడ్డాడు. వినుకొండ వద్ద శరత్​బాబు అనుమానాస్పదంగా కనిపించడంతో.. పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో అసలు విషయం బయటపడిందని పోలీసులు అన్నారు. నిందితుడి నుంచి 10లక్షల రూపాయలు, సెల్​ఫోన్​ స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

"ఇతను ఏటీఎం, ఆన్​లైన్​ మోసాలు చేశాడు. ఇతడు షాప్​కి వెళ్లి వస్తువులు తీసుకుంటాడు. వాటికి నగదు చెల్లించాలి కాబట్టి.. నా ఫోన్​ పనిచేయడం లేదు. నేను చెప్పిన నంబర్​కి 1రూపాయి సెండ్​ చేయమని అడిగేవాడు. వాళ్లు పంపిన తర్వాత తన వాళ్లకు చేరిందో లేదు చూసుకుంటానని ఫోన్​ తీసుకునేవాడు. ఈ క్రమంలో పాస్​వర్డ్​ గమనించి తన నెంబర్​కు నగదు సెండ్​ చేసుకునేవాడు." -రవిశంకర్ రెడ్డి, పల్నాడు జిల్లా ఎస్పీ

How to be Safe from UPI Frauds: యూపీఐ మోసం.. తేడావస్తే అంతే.. ఇలా రక్షించుకోండి!

ఆన్​లైన్​ పేమెంట్​ మేథడ్​తో మోసాలకు తెరలేపిన యువకుడు ​
Last Updated : Nov 24, 2023, 6:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.